హిట్‌ కాంబినేషన్‌ సెట్‌

21 Oct, 2018 01:19 IST|Sakshi

ఒకరు స్టైలిష్‌ స్టార్‌ అయితే మరొకరు మాటల మాంత్రికుడు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అభిమానులకు పండగే పండగ. ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలతో హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలనే నమోదు చేశారు. మరో సూపర్‌ హిట్‌ ఇవ్వడానికి ఇద్దరూ రెడీ అయ్యారని సమాచారం. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా గురించి క్లారిటీ రాలేదు.

పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ఫైనలైజ్‌ అయిందని టాక్‌. అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ మూడో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే తిత్లీ తుఫాన్‌ కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లోని బాధితులకు  25 లక్షల రూపాయలను అల్లు అర్జున్‌ అందచేశారు.

మరిన్ని వార్తలు