తేజ మార్కు ప్రేమకథ!

15 Jun, 2015 23:12 IST|Sakshi
తేజ మార్కు ప్రేమకథ!

 ప్రేమకథా చిత్రాలతో దర్శకుడు తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారనే చెప్పొచ్చు. ఇప్పటి వరకూ ఆయన చేసినవన్నీ దాదాపు ప్రేమకథలే. ఎంతోమంది నూతన నటీనటులను పరిచయం చేశారాయన. ఇప్పుడు నూతన తారలతో ‘హోరాహోరీ’ చిత్రం చేస్తున్నారు. దిలీప్, దక్ష జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కేఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాత. ‘‘డీటీయస్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  ఈ నెలాఖరులో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శకుడు తేజ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కోడూరి కల్యాణ్, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్‌మోహన్ రెడ్డి వి.