హారర్‌ గదిలో...

13 Jul, 2017 23:02 IST|Sakshi
హారర్‌ గదిలో...

మున్నా, ప్రియాంకా శర్మ, మధుశ్రీ, ప్రసన్న వర్మ ముఖ్య తారలుగా శ్రీనివాస్‌ శరగడం దర్శకత్వంలో ఎస్‌. శ్రీనివాస్, ఎస్‌. సుధీర్‌ నిర్మిస్తున్న సినిమా ‘రోషిణి కేరాఫ్‌ తూర్పుగది’. సీఐ రంజిత్‌కుమార్‌గా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో వీరకేశవ నటిస్తున్నారు.

ఈ నెల 17 నుంచి పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో చివరి షెడ్యూల్‌ మొదలవుతోంది. ‘‘ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. కీలక పాత్రధారులపై హారర్‌ సీన్లు చిత్రీకరిస్తున్నాం. వీరకేశవగారి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: జీవీకే.