గురుశిష్యుల మధ్య ‘వార్‌’

27 Aug, 2019 11:50 IST|Sakshi

భారతీయ వెండితెర మీద భారీ చిత్రాలు సందడి చేస్తున్నాయి. సౌత్‌ నుంచి సాహో, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండగా బాలీవుడ్‌ నుంచి అంతుకు మించి అన్నట్టుగా సినిమాలను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్ వార్‌.

ఇప్పటికే టీజర్‌తో సెన్సేషన్‌ సృష్టించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 2 నిమిషాల 25 సెకన్ల ట్రైలర్‌ ప్రేక్షకులను కన్నార్పకుండా చూసేలా చేస్తోంది. సినిమాలో హృతిక్‌ కబీర్‌గా, టైగర్‌ ఖలీద్‌గా కనిపించనున్నారు. గురుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులగా ఎందుకు మారారు అన్నదే వార్‌ కథ. సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమూవీని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు