నా షాపింగంతా ఆన్లైన్లోనే: కరీనా కపూర్

22 Oct, 2013 13:25 IST|Sakshi
నా షాపింగంతా ఆన్లైన్లోనే: కరీనా కపూర్

తనకు ఎప్పుడు కావాలన్నా ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తానని బాలీవుడ్ భామ కరీనా కపూర్ చెబుతోంది. ఆన్లైన్ షాపింగంటే తనకు చచ్చేంత ఇష్టమని, ఇంటర్నెట్లో తాను చాలా సరుకులు కొంటుంటానని ఆమె తెలిపింది. దుకాణాలకు వెళ్లి సరుకులు కొనుగోలు చేసేంత సమయం తనకు ఉండదని, అందుకే ఆన్లైన్ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. ఇక ఇంటర్నెట్లో కొనుగోలు చేయడం మాత్రం చాలా అద్భుతమైన అనుభవమని కరీనా అంటోంది. మలబార్ గోల్డ్ సంస్థ కొత్తగా మొదలుపెట్టిన ఆన్లైన్ స్టోర్ను కరీనా ప్రారంభించింది.

ఆన్లైన్లో కొనేటప్పుడు మామూలుగా వెళ్లి కొనుగోలు చేసినప్పటి కంటే కాస్త ఎక్కువగానే కొంటామని, అయినా అది సంతృప్తికరంగానే ఉంటుందని కరీనా చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే, పునీత్ మల్హోత్రా తీస్తున్న 'గోరీ తేరే ప్యార్ మే' చిత్రంలో ఆమె ఇమ్రాన్ ఖాన్తో కలిసి నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 22వ తేదీన విడుదల కానుంది.

>