ఒకటే లోకం

1 Nov, 2019 05:42 IST|Sakshi
షాలినీ, రాజ్‌ తరుణ్‌

రాజ్‌ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన చిత్రం ‘ఇద్దరిలోకం ఒకటే’. జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న సినిమా విడుదల కానుంది. ‘‘క్యూట్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు ‘దిల్‌’ రాజు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: సమీర్, సంగీతం: మిక్కీ.జె. మేయర్‌.

మరిన్ని వార్తలు