తనయుడి కోసం ఇళయరాజా..!

17 Jan, 2018 11:31 IST|Sakshi

దేశగర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా. ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించిన ఈ లెజెండ్, ఆయన సంగీత దర్శకత్వంలో పలు గీతాలను ఆలపించారు. అయితే ఇతర సంగీత దర్శకుల కోసం ఇళయరాజా పాటలు పాడిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన ఇటీవల జరిగింది.

ఓ యువ సంగీత దర్శకుడు స్వరపరిచిన పాటను ఇళయరాజా ఆలపించారు. అయితే ఆ యువ సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడు యువన్‌ శంకర్‌ రాజానే కావటం విశేషం. ధనుష్‌ హీరోగా ఘనవిజయం సాధించిన మారికి సీక‍్వల్‌గా అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మారి 2’ కోసం ఇళయరాజా ఓ గీతాన్ని ఆలపించారు. ఇటీవల ఈ సాంగ్ రికార్డింగ్‌ పూర్తయ్యింది. ఈ విషయాన్ని హీరో ధనుష్‌ తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా వెల్లడించారు.

మరిన్ని వార్తలు