ఇంద్రగంటి మల్టిస్టారర్‌ మూవీ!

12 Jul, 2018 16:11 IST|Sakshi

‘సమ్మోహనం’ సినిమాతో సమ్మర్‌ ఎండింగ్‌లో కూల్‌గా హిట్‌ కొట్టారు దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ. పదునైన మాటలు, హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు ఇంద్రగంటి. తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఓ మల్టిస్టారర్‌ మూవీని తెరకెక్కించనున్నారు. 

ఇంద్రగంటి మల్టిస్టారర్‌ మూవీని దిల్‌ రాజు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన హీరోలు, హీరోయిన్లు, తదితర వివరాలను త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దిల్‌ రాజు శ్రీనివాస కళ్యాణం, ఎఫ్‌2, మహేష్‌ బాబు-  వంశీ పైడిపల్లి సినిమాలను నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తలు