పీకే సినిమాకు ఐఎస్ఐ పెట్టుబడి: స్వామి

29 Dec, 2014 16:43 IST|Sakshi
పీకే సినిమాకు ఐఎస్ఐ పెట్టుబడి: స్వామి

పీకే సినిమా తీయడానికి డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ప్రశ్నించారు. ఆ సినిమాకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పెట్టుబడి పెట్టిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పీకే సినిమాపై వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు.

అమీర్ ఖాన్ పీకే సినిమాపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు హిందూ సంస్థలు దీనిపై ఫిర్యాదులు చేయగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యడు కూడా వాటికి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కూడా ఆరోపణలు గుప్పించారు.