ముంబై: హీరోయిన్ కృతి సనన్ 2014లో బాలివుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటివరకు నటించింది మూడే చిత్రాల్లో. దీనిపై తాజాగా స్పందించిన కృతి.. తాను కావాలని నెమ్మదిగా చిత్రాలు చేయడంలేదని, కొన్ని సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని వెల్లడించింది.
ఇటీవల విడుదలైన రాబ్తా సినిమాను తాను దిల్వాలే రిలీజ్ కంటే ముందే సైన్ చేసినట్లు కృతి వెల్లడించింది. రాబ్తాలోని పాత్ర కోసం స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, హార్స్ రైడింగ్ లాంటివి నేర్చుకొని రెండు నెలలు ప్రత్యేకంగా సిద్ధమయ్యాయని తెలిపింది. మధ్యలో ఫర్జీ అనే ఓ చిత్రం కోసం డేట్స్ కేటాయించినా అది వర్కవుట్ కాలేదంది. అయినా త్వరత్వరగా చిత్రాలు చేయడం కంటే మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటానంటున్న కృతి.. హీరోపంతి, దిల్వాలే సినిమాల్లో మెరిసింది.