జనతా గ్యారేజ్ రిలీజ్పై అనుమానాలు

11 Aug, 2016 08:39 IST|Sakshi
జనతా గ్యారేజ్ రిలీజ్పై అనుమానాలు

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో పాటు భారీ స్టార్ కాస్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్పై మరోసారి అనుమానాలు కలుగుతున్నాయి. ముందుగా జనతా గ్యారేజ్ను ఆగస్టు 12 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్న ప్రకారం శరవేగంగా షూటింగ్ చేసినా.. టార్గెట్ను అందుకోలేమేమో అన్న అనుమానంతో వాయిదా వేయక తప్పలేదు.

అందుకే మూడు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్ 2 జనతా గ్యారేజ్ రిలీజ్కు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే ఆ రోజు రిలీజ్ విషయంలో కూడా చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ట్రేడ్ యూనియన్స్తో పాటు లెఫ్ట్ పార్టీలు సయుక్తంగా సెప్టెంబర్ 2న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో బంద్ ప్రభావం సినిమా రిలీజ్పై పడే అవకాశం ఉందన్న ఆలోచనలో ఉన్నారు యూనిట్.

తెలుగుతో పాటు మళయాలంలో కూడా భారీ రిలీజ్కు ప్లాన్ చేయటంతో రికార్డ్ ఓపెనింగ్స్ టార్గెట్ చేసిన యూనిట్ సభ్యులకు ఇప్పుడు బంద్ భయం పట్టుకుందట. అందుకే ఒక రోజు ఆలస్యం సినిమాను రిలీజ్ చేయాలా..? లేక ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తే బాగుంటుందా..? అన్న ఆలోచన చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జనతా గ్యారేజ్ యూనిట్ త్వరలోనే సినిమా రిలీజ్పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.