వ్యయసాయం చేస్తా

22 Apr, 2019 02:20 IST|Sakshi

కెరీర్‌లో తన 25వ చిత్రం కోసం వ్యవసాయం చేస్తానంటున్నారు తమిళ నటుడు ‘జయం’ రవి. అవును.. ఆయన 25వ చిత్రం ఖరారు అయ్యింది. ఈ చిత్రానికి లక్ష్మణ్‌ దర్శకత్వం వహిస్తారు. ఇదివరకు ‘జయం’ రవి హీరోగా రోమియో జూలియట్‌ (2014), బోగన్‌ (2017) చిత్రాలను లక్ష్మణ్‌ తెరకెక్కించారు. తాజా సినిమాలో ‘జయం’ రవి రైతుగా నటించబోతున్నారు. ‘‘తన 25వ చిత్రానికి నన్ను దర్శకునిగా ఎంచుకున్నందుకు రవికి థ్యాంక్స్‌. వ్యవసాయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సోషల్‌ మెసేజ్‌ కూడా ఉంది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. ఓ సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ కూడా ఉంది. ఈ విషయాన్ని త్వరలో చెబుతాం’’ అన్నారు. ఈ సినిమా షూటింగ్‌ జూన్‌ 15న స్టార్ట్‌ కానుంది.

మరిన్ని వార్తలు