మాఫియా నేపథ్యంలో జయంత్ సినిమా

20 Sep, 2016 13:29 IST|Sakshi
మాఫియా నేపథ్యంలో జయంత్ సినిమా

ఒకప్పుడు స్టైలిష్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న జయంత్ సి పరాన్జీ, ఈ మధ్య ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్తో స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న జయంత్, తరువాత వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయాడు. దీంతో చాలా రోజులుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న జయంత్ తాజాగా గంటా శ్రీనివాస్ తనయుణ్ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు.

ఉగ్రం పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాతో నీలేష్ ఈటి అనే కొత్త హీరోను పరిచయం చేయనున్నాడు. ఇసాబెల్లా అనే మోడల్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. ముంబై మాఫియాకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కు మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఎక్కువగా భాగం షూటింగ్ ముంబైలోనే జరగనుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను పూర్తిచేసి నవంబర్ నుంచి ఉగ్రంను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ ఉన్నాడు జయంత్.