అమ్మ దీవెన

18 Feb, 2020 05:11 IST|Sakshi

ఆమని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో లక్ష్మీ సమర్పణలో ఎత్తరి మారయ్య, చిన మారయ్య, గురవయ్య నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జీవితా రాజశేఖర్‌ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమని మాట్లాడుతూ– ‘‘మగదిక్కు లేని కుటుంబంలో ఓ స్త్రీ ఐదుమంది పిల్లలని ఎలా చదివించింది? వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దింది? అనే కథతో వస్తున్న మా సినిమాని సపోర్ట్‌ చేస్తున్న జీవితగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఆమనిగారి కెరీర్‌లో మైలురాయిలా నిలిచే సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘మంచి సినిమా నిర్మించాలని నిర్మాతలు రాజీపడలేదు’’ అన్నారు శివ ఏటూరి.

మరిన్ని వార్తలు