క్రీస్తు విశేషాలతో...

22 Dec, 2015 23:37 IST|Sakshi
క్రీస్తు విశేషాలతో...

ఏసుక్రీస్తు జీవిత విశేషాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి కి రణం’. పీడీ రాజు ముఖ్య పాత్రలో నటించిన  ఈ చిత్రానికి కె.జాన్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. దర్శకుడు మట్లాడుతూ -‘‘గోవా, ఈజిప్ట్, పాలస్తీనా, ఇజ్రాయిల్‌లో జరిపే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. మార్చి 25న గుడ్‌ఫ్రైడే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి.పట్నాయక్, కథ-మాటలు: టి.ప్రభుకిరణ్, కథా సహకారం: వి.ఎమ్.ఎమ్.ప్రవీణ్, ఛాయాగ్రహణం: మురళీకృష్ణ.