జలపాతం దగ్గర జోరుగా..

4 Aug, 2016 23:11 IST|Sakshi
జలపాతం దగ్గర జోరుగా..

పచ్చదనం పరచినట్లుండే కేరళ అది. అక్కడి చాలకుడి జలపాతం మరింత సుంద రమైన ప్రదేశం. కలర్‌ఫుల్‌గా ఉండే ఆ బ్యాక్‌డ్రాప్‌లో చిన్న ఎన్టీఆర్, సమంత ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ‘జనతా గ్యారేజ్’ చిత్రం కోసమే ఈ ఆటా పాటా అని గ్రహించే ఉంటారు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. ఒక పాటను ఎన్టీఆర్, సమంతలపై కేరళలోని చాలకుడి జలపాతం దగ్గర చిత్రీకరిస్తున్నారు.

ఆ పాట పూర్తి కాగానే హైదరాబాద్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, కాజల్‌పై ప్రత్యేక గీతం చిత్రీకరించనున్నారు. ఇందులో నిత్యామీనన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 12న హైదరాబాద్‌లో విడుదల చేయనున్నారు. సినిమాను తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించినా చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో సెప్టెంబరులో విడుదల చేయాలని నిర్ణయించు కున్నారు.