కల్యాణ్ రామ్తో జూ.ఎన్టీఆర్

19 Oct, 2015 12:39 IST|Sakshi
కల్యాణ్ రామ్తో జూ.ఎన్టీఆర్

చెన్నై: నందమూరి వారసులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

'కల్యాణ్ రామ్ బ్యానర్లో ఓ చిత్రంలో నటించేందుకు జూ.ఎన్టీఆర్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సివుంది' అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. కిక్, రేసుగుర్రం సినిమాలకు వంశీ రచయితగా పనిచేశారు.