నగరంలో తారక్‌

11 Dec, 2019 13:27 IST|Sakshi
విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మంగళవారం విశాఖ విచ్చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉదయం 7.30 గంటలకు ఎయిర్‌ ఇండియా విమానంలో వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా పాడేరు వెళ్లారు. అక్కడి మోదకొండమ్మ ఆలయం వద్ద జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న అనంతరం తిరిగి విశాఖ చేరుకొని సాయంత్రం 6.30 గంటలకు ఎయిరిండియా విమానంలో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. విమానాశ్రయంలో ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

మరిన్ని వార్తలు