జస్టిన్‌ బీబర్‌ ముంబై షో... ఒక్కో టికెట్ రూ.76,000

23 Feb, 2017 12:22 IST|Sakshi
జస్టిన్‌ బీబర్‌ ముంబై షో... ఒక్కో టికెట్ రూ.76,000

కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్ పర్యటన కన్ఫామ్ అయ్యింది. మే 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ షోలో బీబర్ దాదాపు పది పాటలను ప్రదర్శించే అవకాశం ఉంది. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ షో టికెట్స్ కోసం ఫిబ్రవరి 22 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ధరతో ఈ టికెట్స్ను అమ్ముతున్నారు.

అంతర్జాతీయ స్థాయి వీవీఐపిలు ఈ షోకు హాజరవుతున్న నేపథ్యంలో వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీ టికెట్ ధర రూ.76000 వేలుగా నిర్ణయించారు. ఆ తరువాత వివిధ క్యాటగిరీల్లో రూ.4000 వేల వరకు టికెట్ ధరలను నిర్ణయించారు. ఇప్పటికే వీవీఐపిల కోసం కేటాయించిన టికెట్లు అమ్ముడవ్వగా మిగిలిన కేటగిరిల టికెట్లు కూడా మరికొద్ది గంటల్లోనే అమ్ముడవుతాయని భావిస్తున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్ ఈ షోకు హారవ్వనున్నారు. పర్పస్ వరల్డ్ టూర్ పేరుతో చేపట్టిన జస్టిన్ బీబర్ ఇండియా టూర్కు వైట్ ఫాక్స్ ఇండియా టీం ప్రమోటర్గా వ్యవహరిస్తోంది.