అక్కా తమ్ముడైన అన్ని–మచ్చాన్‌

28 Apr, 2019 02:52 IST|Sakshi

నిజ జీవితంలో అన్ని (వదిన)– మచ్చాన్‌ (మరిది) జ్యోతిక–కార్తీ ఓ సినిమా కోసం అక్కాతమ్ముళ్లుగా మారారు. మలయాళ ‘దృశ్యం’ ఫేమ్‌ జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్‌ ముఖ్య తారలుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘‘అన్నితో తొలిసారి స్క్రీన్‌ను షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీతూగారితో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం ఆసక్తిగా ఉన్నాను. ఇక మా టీమ్‌కు సత్యరాజ్‌ వంటి నటులు మరింత బలం’’ అని కార్తీ పేర్కొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. సినిమాలో కార్తీ, జ్యోతికలకు సత్యరాజ్‌ తండ్రి పాత్ర చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌.

మరిన్ని వార్తలు