ఘనంగా మగలీర్‌ మట్టుం ఆడియో వేడుక

25 Apr, 2017 02:11 IST|Sakshi
ఘనంగా మగలీర్‌ మట్టుం ఆడియో వేడుక

టాలీవుడ్‌ హీరో సూర్య సతీమణి, నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మగలీర్‌ మట్టుం. 1994లో రేవతి, ఊర్వశి, రోహినిల నటనలో విడుదలైన చిత్రం మగలీర్‌ మట్టుం ఉద్యోగాలకు వెళ్లే మహిళల ఇబ్బందుల నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ప్రస్తుతం అదే పేరుతో అటువంటి కథాంశంతోనే జ్యోతిక, శరణ్యా పొన్‌వన్నన్, ఊర్వశి, బానుప్రియ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న ‘కుట్రం కడిదల్‌’ చిత్ర దర్శకుడు బ్రహ్మ దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, సూర్య తన 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ద్వారా నిర్మించారు.

ఈ చిత్ర టీజర్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదేవిధంగా ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సూర్య తన ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ స్థితిలో మగలీర్‌ మట్టుం ఆడియోను విడుదల చేశారు. కార్యక్రమంలో సూర్య, కార్తీలతో పాటు చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. కాగా ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించడం విశేషం.