చిరంజీవితో కాజల్ అగర్వాల్ మళ్లీ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘ఆచార్య’ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు త్రిష. ఇప్పుడు త్రిష ప్లేస్లో కాజల్ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా మొదలయ్యాయట. చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ (2017)లో కాజల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ జంట స్క్రీన్పై కనిపిస్తుందా? వెయిట్ అండ్ సీ.