వైరల్‌గా మారిన కాజోల్‌ మెహందీ ఫంక్షన్‌ ఫొటో!

25 Apr, 2020 15:42 IST|Sakshi
వైరల్‌గా మారిన కాజోల్‌ మెహందీ ఫొటో!

బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌ మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఓ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటో వైరలయ్యేంతలా అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌. 1991లో జరిగిన ఈ మెహందీ ఫంక్షన్‌కు భార్య గౌరీఖాన్‌, కుమారుడ్‌ ఆర్యన్‌లతో కలిసి హాజరయ్యారాయన. కాజోల్‌ చేతికి గోరింటాకుతో సోఫాలో కూర్చుని ఉండగా ఆమె వెనకాల కుమారుడు ఆర్యన్‌తో షారుఖ్‌, అతడి పక్కన గౌరీ ఉన్నారు. కిరణ్‌ ఎస్‌ఆర్‌కే ఫ్యాన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారుడు ఈ ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో ఇరువురి ఫ్యాన్‌క్లబ్‌లకు చెందిన అభిమానులు ఈ ఫొటోను చూసి మురిసి పోతున్నారు. (పది మిలియన్‌ ఫాలోవర్స్‌ క్లబ్‌లో కాజోల్‌)

కాగా, షారుఖ్‌, కాజోల్‌లు కలిసి నటించిన పలు చిత్రాలు ఆల్‌టైం బ్లాక్‌ బ్లాస్టర్లుగా నిలిచిన సంగతి విధితమే. వీరు నటించిన 1995 ‘దిల్‌ వాలే దుల్షేనియా లేజాయేంగే’  ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్రం ముంబైలోని  మరాఠా మందిర్‌ సినిమా హాల్లో ఇప్పటికీ ఆడుతూనే ఉండటం గమనార్హం. వీరు చివరగా కలిసి నటించిన సినిమా రోహిత్‌ శెట్టి ‘దిల్‌వాలే’.

మరిన్ని వార్తలు