మరుదనాయగమ్‌ ఎవరు?

31 Oct, 2019 00:07 IST|Sakshi
విక్రమ్‌, కమల్‌హాసన్‌

కమల్‌హాసన్‌కి డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ చాలానే ఉన్నాయి. వాటిలో ‘మరుద నాయగమ్‌’ ఒకటి. 1997లో స్వీయదర్శకత్వంలో టైటిల్‌ రోల్‌ చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టారు కమల్‌. అయితే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దానికి ఓ కారణం బడ్జెట్‌ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఏదో సందర్భంలో కమల్‌ ప్రస్తావిస్తూ వస్తున్నారు.

తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘మరుదనాయగమ్‌’ని పూర్తి చేయాలనుకుంటున్నానని కమల్‌ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నందువల్ల ఈ సినిమాలో నటించలేనని స్పష్టం చేశారు. విక్రమ్‌ నటిస్తారని టాక్‌. ఇంతకీ ‘మరుదనాయగమ్‌’ ఎవరు? అంటే.. 18వ శతాబ్దానికి చెందిన పోరాట యోధుడు. ఆయన ఇస్లామ్‌ మతానికి మారాక యూసఫ్‌ ఖాన్‌గా పేరు మార్చుకున్నారు.

మరిన్ని వార్తలు