తెలుగు సినిమాకు ఓకె చెప్పిన కంగనా..?

13 Nov, 2016 10:55 IST|Sakshi
తెలుగు సినిమాకు ఓకె చెప్పిన కంగనా..?

వంద కోట్ల సినిమాలతో పాటు, అదే స్థాయిలో వివాదాలతోనూ వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్. ఒకప్పుడు బాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది. అదే జోరును దక్షిణాదిలో కూడా చూపించేందుకు ప్లాన్ చేసుకుంటుంది ఈ బోల్డ్ బ్యూటి.

ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్నిరంజన్ సినిమాలో హీరోయిన్గా నటించింది కంగనా. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో తెలుగు సినిమా నాకు సరిపడదంటూ తిరిగి బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఇన్నేళ్ల తరువాత మరోసారి పూరి దర్శకత్వంలోనే తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న కంగనా, తెలుగులోనూ అదే తరహా సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. పూరి కూడా జ్యోతిలక్ష్మీ తరహా కథతో కంగనాతో సినిమా చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

>