తరగతులకు వేళాయె!

28 Aug, 2019 07:35 IST|Sakshi
కంగనా రనౌత్‌

క్రమశిక్షణగా క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతున్నారు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌. ఈ క్లాసులు ఎందుకంటే సినిమా కోసమే. ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్‌ పెట్టారు) చిత్రం కోసం కంగనా రనౌత్‌ భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ క్లాసులతోనే ఆమె బిజీగా ఉన్నారని తెలిసింది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో కంగనా రనౌత్‌ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం ప్రారంభం కానుంది. అందుకే భరతనాట్యం క్లాసులతో బిజీ అయ్యారు కంగనా. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌. సింగ్‌ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరిన్ని వార్తలు