లండన్ పార్లమెంట్ అవార్డు అందుకున్న నటుడు

21 Oct, 2017 10:33 IST|Sakshi

చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్ గురువారం లండన్ లో గ్లోబల్‌ డైవర్సిటీ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్‌లో లండన్ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక అవార్డును దక్షిణ భారత్‌లో తొలిసారిగా కన్నడ నటుడు అందుకుంటున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు కుమారుడితో కలిసి లండన్ వెళ్లిన దర్శన్ ఆ ఫొటోను సామాజిక మాధ్యమంలో షేర్‌ చేశారు.

కన్నడ సినీ రంగంలో దర్శన్ సాధనను మెచ్చుకొని లండన్ ప్రభుత్వం ఈసారి సినిమా రంగంలో భారతదేశం నుంచి నటుడు దర్శన్ కు గౌరవ పురస్కారాన్ని అందించింది. లండన్ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలందించిన సాధకులను సన్మానిస్తున్నారు. లండన్ లో ఉన్న దర్శన్ కొడుకు వినీశ్‌తో తీసుకున్న ఫొటో ట్విటర్‌లో పోస్ట్‌ చేయటంతో వైరల్‌ అయింది.

మరిన్ని వార్తలు