ఐదేళ్ల తర్వాత...!

13 Apr, 2020 00:19 IST|Sakshi
ఉపేంద్ర

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (2015) చిత్రం తర్వాత స్ట్రయిట్‌ తెలుగు చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించలేదు ఉపేంద్ర. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఉపేంద్ర ఓ తెలుగు సినిమాలో నటించనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు ఉపేంద్రను సంప్రదించారట చిత్రబృందం. మరి... పరుశురామ్‌ కథకు ఉపేంద్ర ఊ అంటారా? వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని వార్తలు