బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకున్న నటుడు హృతిక్ రోషన్ ను పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. ముంబయ్లోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హృతిక్ ను దర్శకుడు సంజయ్ కపూర్, ఆయన సతీమణి మహీప్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, దర్శకులు మధు బండార్కర్, కరణ్ మల్హోత్రా, నటులు షర్మాన్ జోషి, ఉదయ్ చోప్రా పరామర్శించారు.
సబ్డ్యూరల్ హిమాటోమా’ వ్యాధితో బాధపడుతున్న హృతిక్ కు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు హిందుజా ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. 'బాంగ్ బాంగ్' సినిమా షూటింగ్ లో రెండు నెలల క్రితం హృతిక్ తలకు దెబ్బ తగలడంతో బ్రెయిన్లో బ్లడ్ కాట్ అయింది. దీంతో అతడికి ఆపరేషన్ చేశారు.
హృతిక్ రోషన్ కు నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైందని డాక్టర్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామన్నారు. నాలుగు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సలహాయిచ్చారు. హృతిక్ నటించిన 'క్రిష్ 3' నవంబర్ లో విడుదలకానుంది.