ముంబై: లాక్డౌన్లో తన కవల పిల్లలు యష్, రూహీల సరదా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చూస్తూ తన సంతోషాన్ని పంచుకుంటూ ఉండే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మంగళవారం ఆసక్తికర పోస్టును పంచుకున్నాడు. తను అత్యంత ద్వేషించేవి ఈ రెండు అంశాలే అంటూ కరణ్ భావోద్యేగ పోస్టును తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే రెండు కీలక అంశాలైన చావు, వివాహలపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు. ‘డియర్ డెత్.. మీరు చాలా అహంకారంగా ఉంటారు. ఎందుకంటే మీరు మనిషి జీవితంలో ఆకస్మాత్తుగా సంభవించే విషాద ఘటనవు అని మీకు తెలుసు... కానీ ఎప్పటికీ మీరు మనిషిలో జరిగే జ్ఞాపకాల యుద్దాన్ని గెలవలేరు. జీవితానికి దూరంగా ఉండండి’ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. (‘నువ్వు పాట పాడితే తలనొప్పి ఖాయం’)
అదే విధంగా వివాహంపై... ‘‘డియర్ వెడ్డింగ్.. అధికారంగా మిమ్మల్ని నేను ద్వేషిస్తున్నాను. మీరు బీఎఫ్ఎఫ్ను మోసం చేసే చర్యలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ విషయంలో క్రూరంగా ఉంటారు కూడా. మాకు వేడుక, ఆనందం, నిజమైన భావోద్యేగాల ప్రపంచాన్ని చూపిస్తారు. ఆ తర్వాత వాటిని తుడిచిపెట్టుకుపోతారు. వివాహం అంటేనే బాధాకరమైనది’’ అంటూ ఇన్స్టాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఎప్పుడు సరదాగా ఉండే కరణ్ నిరాశ పోస్టు చూసి సెలబ్రెటీలు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కాగా 44 ఏళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న కరణ్ సరోగసీ ద్వారా రూహీ, యష్లకు తండ్రైన విషయం తెలిసిందే. (దర్శకులకు ఆఫర్.. తండ్రి పాత్రలకైనా సిద్దం)