2012 లో తమిళంలో ఘనవిజయం సాధించిన 'వెట్టై' చిత్రం రీమేక్ పై బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కన్నేశాడు. తమిళ నటుడు ఆర్య, ఆర్ మాధవన్, సమీరా రెడ్డి, అమలా పాల్ నటించిన వెట్టై చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
'వెట్టై చిత్రాన్ని ఇటీవల చూశాను. ఆ చిత్రం ఇంప్రెసివ్ గా ఉంది. అయితే ఆ చిత్ర నిర్మాణ హక్కులు యూటీవీ వద్ద ఉన్నట్టు తెలిసింది. యూటీవీ దాంతో వెట్టై చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకున్నాను. త్వరలోనే నటీనటుల పేర్లను ప్రకటిస్తాం' అని కరణ్ జోహార్ అన్నారు.
హిందీ రీమేక్ కు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని, షాహీద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి అబ్సాస్, మస్తాన్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహంలు నటించనున్నట్టు వార్తలు బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. వెట్టై చిత్రాన్ని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా తమన్నా హీరోయిన్ గా తడాఖా పేరుతో తెలుగులో నిర్మించిన సంగతి తెలిసిందే.