కర్ణాటక, యశవంతపుర: తక్కువమంది కళాకారులు, సాంకేతిక నిపుణులతో టీవీ సీరియల్స్ చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. టీవీ అసోసియేషన్తో సీఎం సమీక్షించారు. కరోనా నివారణ మార్గదర్శకాలను పాటిస్తూ చిత్రీరకణ చేసుకోవటానికీ అంగీకరించారు. సీరియల్స్ షూటింగ్లో 12 మంది మాత్రమే ఉండాలి. బహిరంగ ప్రదేశాలలో షూటింగ్లకు అనుమతి లేదు.