కార్తీ దొంగ

16 Nov, 2019 05:06 IST|Sakshi
కార్తీ, జ్యోతిక

వదిన జ్యోతిక, మరిది కార్తీ తొలిసారి కలిసి నటించిన తమిళ చిత్రం ‘తంబి’. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూరజ్‌ సదన్‌ నిర్మించిన ఈ సినిమాని  తెలుగులో ‘దొంగ’ పేరుతో డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ‘దొంగ’ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను హీరో సూర్య రిలీజ్‌ చేశారు. ‘‘ఏడాదిగా ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం తెరకెక్కిన విధానం చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు కార్తీ. ఈ సినిమా టీజర్‌ నేడు విడుదలవుతోంది. కార్తీ హీరోగా ఇటీవల వచ్చిన ‘ఖైదీ’, ఇప్పుడు ‘దొంగ’ టైటిల్స్‌ చిరంజీవి నటించిన సినిమా టైటిల్సే కావడం విశేషం.

>
మరిన్ని వార్తలు