ప్రేమికుల దినోత్సవానికి రెడీ

11 Jan, 2019 00:13 IST|Sakshi
కార్తీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

కార్తీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవ్‌’. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. లక్ష్మణ్‌ కుమార్, ‘ఠాగూర్‌’ మధు తెలుగు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి  రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు . ఇప్పటికే విడుదలైన ‘దేవ్‌’ ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చిం ది. షూటింగ్‌ పూర్తి చేసుకొన్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

‘ఖాకీ’ చిత్రం తర్వాత కార్తీ, రకుల్‌ మరోసారి జత కట్టారు. ప్రేమికుల దినోవత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ¯ð ల 14న చిత్రం ఆడియో వేడుక జరగనుంది. ‘‘ఇప్పటికే విడుదలైన తమిళ ఆడియోకు మంచి స్పందన లభించింది. తెలుగు పాటలకు కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హారీశ్‌ జయరాజ్, కెమెరా: వేల్రాజ్‌.

మరిన్ని వార్తలు