ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

21 Jul, 2019 03:46 IST|Sakshi

ధనుష్‌ హీరోగా ‘పిజ్జా, పేట’ చిత్రాల ఫేమ్‌ కార్తీ్తక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌లో ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నట్లు వై నాట్‌ స్టూడియో సంస్థ తెలిపింది. ఇందులో ఐశ్వర్యాలక్ష్మీ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. షూటింగ్‌ మొత్తాన్ని యూకేలో జరుపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించనున్నారు.

మరిన్ని వార్తలు