వెల్కమ్‌ కత్రినా

23 Apr, 2019 00:32 IST|Sakshi
కత్రినా కైఫ్‌

బాలీవుడ్‌లో మాస్‌ మసాలా కమర్షియల్‌ చిత్రాలకు రోహిత్‌ శెట్టి చిత్రాలు పెట్టింది పేరు. లేటెస్ట్‌గా ఆయన రూపొందిస్తున్న పోలీస్‌ డ్రామా ‘సూర్యవన్షీ’. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. ‘వెల్కమ్‌ కత్రినా’ అంటూ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించారు చిత్రబృందం. రోహిత్‌ శెట్టి డైరెక్షన్‌లో అక్షయ్‌ తొలిసారి నటిస్తున్నారు. వచ్చే ఏడాది రంజాన్‌ సీజన్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు