24 గంటల్లో కోటీ 60లక్షల మంది చూశారు!

30 Apr, 2019 11:35 IST|Sakshi

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా కాజల్‌, మెహరీన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ కవచం. సాయి శ్రీనివాస్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్‌ మామిల్ల దర్శకుడు. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆ సినిమా ఆన్‌లైన్‌ మాత్రం సత్తా చాటుతోంది.

సోమవారం ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్‌ యూట్యూబ్‌లో రిలీజ్‌ అయ్యింది. ఇన్స్‌పెక్టర్ విజయ్‌ పేరుతో రిలీజ్‌ అయిన ఈ సినిమాను 24 గంటల్లోనే కోటీ 60 లక్షల మందికిపైగా వీక్షించారు. మాస్‌ యాక్షన్ సినిమా కావటంతో పాటు బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ విలన్‌గా నటించటంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు కవచం డబ్బింగ్‌ వర్షన్‌పై ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు.

మరిన్ని వార్తలు