సేమ్‌ టు సేమ్‌ సావిత్రి

24 Feb, 2018 00:31 IST|Sakshi
కీర్తీ సురేష్‌

సినిమా రిలీజ్‌కాక ముందే సేమ్‌ టు సేమ్‌ సావిత్రి అనేస్తున్నారేంటీ అనుకుంటున్నారా? ఇక్కడ చెప్పబోతున్నది అభినయం గురించి కాదండి, అలవాట్ల గురించి. నాకూ సావిత్రి గారికి కామన్‌ ఇంట్రెస్ట్‌లు చాలానే ఉన్నాయి అంటున్నారు కీర్తీ సురేష్‌. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తీ సురేష్‌ పోషిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్రను పోషించడానికి చాలా హోమ్‌ వర్కే చేశారట Mీ ర్తి. సావిత్రిగారి గురించి ఇంకా బాగా తెలుసుకోవటానికి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరితో కూడా మాట్లాడారట.

అప్పుడు తనకూ సావిత్రికీ సంబంధించిన చాలా కామన్‌ ఇంట్రెస్ట్‌లు తెలుసుకున్నారట కీర్తీ. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ–  ‘‘విజయ చాముండేశ్వరిగారు వాళ్ల అమ్మగారి మేనరిజమ్స్, హావభావాలు, వాళ్ల ఇద్దరు మధ్య బాండ్‌ గురించి చాలా బాగా మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత ఒక నాలుగు పేజీలు ఉన్న లెటర్‌ను పంపించారామె. ఆ లెటర్‌ చదివిన తర్వాత సావిత్రిగారికీ నాకు కొన్ని విషయాలు కలవడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.

సావిత్రిగారు స్విమ్మింగ్‌ చేసేవారు. నాకు స్విమ్మింగ్‌ అంటే చాలా ఇష్టం. మా ఇద్దరికీ టీ అంటే చాలా ఇష్టం. ఆమె క్రికెట్‌ ఆడేవారు. నేను స్కూల్‌ డేస్‌లో క్రికెట్‌ బాగా ఆడేదాన్ని. తనకు కార్‌ డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. నాక్కూడా ఇష్టమే..’’ అని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు కీర్తీ. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 29న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు