దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఆర్ఆర్ఆర్లో తారక్, చరణ్లకు హీరోయిన్లు వీళ్లే అంటూ ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. ఎన్టీఆర్కు జోడిగా కీర్తిసురేష్, చెర్రీకు జంటగా పూజ హెగ్డేలు కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ ఇద్దరు భామలు మంచి ఫాంలో ఉండటంతో ఈ వార్త నిజమే అయి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమా స్వాతంత్ర్య సమరం నాటి కథ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ప్రకటన రాలేదు.