మహేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌!

18 Jun, 2020 20:17 IST|Sakshi

మహానటి సినిమాతో జాతీయ  అవార్డును సొంతం చేసున్న కీర్తి సురేష్‌  నటించిన తాజా చిత్రం పెంగ్విన్‌. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ ఫాంలో రేపు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్‌  ఇన్‌స్టా గ్రాం వేదికగా తన అభిమానుతో ముచ్చటించారు. ఈ చర్చాగోష్ఠిలో భాగంగా ఆమె కొన్ని  ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు. తన తదుపరి ప్రాజెక్ట్‌లో మహేష్‌ బాబుతో కలిసి నటిస్తున్నట్లు  స్వయంగా వెల్లడించారు. దీంతో మహేష్‌బాబు సినిమా సర్కారు వారి పాటలో కీర్తి నటిస్తున్నట్లు స్పష్టం అయ్యింది. మహానటితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి ఒక విభిన్నమైన కథనం పెంగ్విన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  కరోనా కారణంగా థియేటర్లు తెరవడానికి సర్కారు అనుమతినివ్వక పోవడంతో ఇది ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్‌ అవుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. (అమెజాన్‌ ప్రైమ్‌లో కీర్తి సినిమా విడుదల)

మరిన్ని వార్తలు