హీరోయిన్ కీర్తి సురేష్ తగ్గింది అనే అనగానే ఆమె బరువు తగ్గింది అని అనుకుంటున్నారా. అవును అది నిజమే. ఆ మధ్య బాలీవుడ్లోకి ప్రవేశ ప్రయత్నం చేసింది. అందుకోసం కీర్తిసురేష్ బరువు తగ్గి చాలా స్లిమ్గా తయారైంది. కాగా కీర్తి నటించిన తమిళ చిత్రం పెంగ్విన్ ఈనెల 19వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రచారం కావడానికి సిద్ధమవుతోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న అన్నాత్తా చిత్రంలో కీర్తిసురేష్ ఆయనకు కూతురుగా నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా షూటింగ్కు బ్రేక్ పడింది. దీంతో దీపావళికి విడుదల కావాల్సిన అన్నాత్తా చిత్రం సంక్రాంతికి వాయిదా పడింది. ఇకపోతే మరో విషయం ఏంటంటే కీర్తి సురేష్ తన పారితోషికాన్ని భారీగా తగ్గించుకుంది. చదవండి: అవును.. నేను రణ్బీర్ గొడవలు పడతాం!
లాక్డౌన్ కారణంగా యావత్ చిత్రపరిశ్రమ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా మళ్లీ బతికి బట్టకట్టాలంటే పెనుమార్పులు అవసరమని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా నటీనటులు తమ పారితోషికాలను తగ్గించుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయంలో నటుడు విజయ్ఆంటోని, ఉదయ, నటి ఆర్తి వంటి కొందరు నటీనటులు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ముందుకొచ్చారు. అయితే కోట్లను పారితోషకం అందుకుంటున్న స్టార్ హీరో హీరోయిన్లు ఈ విషయంలో ఇంకా ఇలాంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయలేదు అన్నది గమనార్హం.
కాగా కీర్తి సురేష్ తాజాగా తన పారితోషకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆమె నిర్ణయాన్ని సినీ పరిశ్రమ వర్గాలు స్వాగతిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే కీర్తిసురేష్ తండ్రి సురేష్ కుమార్ మలయాళంలో నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన ఆ మధ్య సినీ పరిశ్రమ కోలుకోవాలంటే నటీనటులు పారితోషకాన్ని అని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కీర్తి సురేష్ పారితోషకం తగ్గించుకున్నట్టు ప్రకటించటం విశేషం. అయితే ఈమె గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. చదవండి: ఆగస్టులో నిర్మాతల మండలి ఎన్నికలు?