ఈసారి ఆల్బమ్‌ కోసం...

31 Mar, 2019 06:30 IST|Sakshi
పరిణీతీ చోప్రా

పరిణీతీ చోప్రాలోని నటి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆమెలో గాయని కూడా ఉంది. ఆల్రెడీ ఆడియన్స్‌కు తనలోని గాయనిని ఓసారి పరిచయం చేశారు. లేటెస్ట్‌గా మరోసారి గొంతు సవరించుకోవడానికి రెడీ అయ్యారు పరిణీతీ చోప్రా. బాలీవుడ్‌ గీత రచయిత మనోజ్‌ ముంటషీర్‌ రాసిన ‘తేరి మిట్టీ’ అనే పాటను ఆలపించనున్నారు పరణీతి. అర్మాన్‌ మాలిక్‌ స్వరపరచిన ఈ పాట సినిమా కోసం కాదు... ప్రైవేట్‌ ఆల్బమ్‌. ఇదివరకు పరిణీతీ చోప్రా నటించిన ‘మేరీ ప్యారీ బిందు’ సినిమాలో ‘మానా కే హమ్‌ యార్‌ నహీ’ అనే పాట పాడారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్‌ లభించింది. కొంచెం గ్యాప్‌ తర్వాత మరో పాటతో సిద్ధమయ్యారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. పరిణీతి నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘కేసరి’ బాక్సాఫీస్‌ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. 

మరిన్ని వార్తలు