దసరాకు రాకీ భాయ్‌ వస్తున్నాడు

14 Mar, 2020 01:26 IST|Sakshi
యష్‌

రెండేళ్ల క్రితం వెండితెరపై రాకీ భాయ్‌ సత్తా ఏంటో బాక్సాఫీస్‌కు తెలిసింది. ఇప్పుడు రాకీ భాయ్‌ మళ్లీ వస్తున్నాడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌  హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌1’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఇందులో రాకీ పాత్రలో నటించారు యష్‌. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘అధీర పాత్రలో నటిస్తున్న సంజయ్‌ దత్, రవీనాటాండన్, యశ్‌లపై చిత్రీకరించిన సన్నివేశాలతో ఈ సినిమా మేజర్‌ షెడ్యూల్‌ పూర్తయింది’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. భువన్‌ గౌడ కెమెరామేన్‌. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ‘కేజీఎఫ్‌’  ఫస్ట్‌ పార్ట్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో సీక్వెల్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు