అక్క చెప్పింది... చెల్లి వస్తోంది!

14 Apr, 2019 00:28 IST|Sakshi
ఖుషీ కపూర్‌

అతిలోకసుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల పెద్దకుమార్తె జాన్వీ కపూర్‌ ‘ధడక్‌’ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్‌. ఈ విషయాన్ని జాన్వీ కపూర్‌ ఓ చాట్‌ షోలో భాగంగా కన్ఫార్మ్‌ చేశారు. ‘‘ఖుషీ యాక్టింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది. ఏదో అలా వచ్చాంలే అనుకోకుండా ముందు ట్రైనింగ్‌ తీసుకోవాలనుకుంటోంది. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకోనుంది.

ఈ విషయంపై నాన్న బోనీ కపూర్‌ కూడా కాస్త ఎగై్జటింగ్‌గానే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీకపూర్‌. ఇక.. జాన్వీని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్‌ చేసిన కరణ్‌ జోహారే తనను కూడా ఇంట్రడ్యూస్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచనను వ్యక్తపరిచారట ఖుషీకపూర్‌. ఆలియా భట్, సిద్దార్ధ్‌మల్హోత్రా, వరుణ్‌ధావన్‌ ఇలా చాలామంది స్టార్స్‌ కొడుకులు, కూతుర్లను కరణ్‌ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందరూ కూడా కెరీర్‌లో దూసుకెళుతున్నారు.

మరిన్ని వార్తలు