‘నా పేరు సూర్య’ ఫలితంతో డీలాపడ్డ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. న్యూ ఇయర్ కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో తన తదుపరి ప్రాజెక్ట్ ఉండనుందని ప్రకటించాడు. అయితే మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వాణీని ఈ చిత్రానికి హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘వినయ విధేయ రామ’ రిలీజ్కు రెడీ ఉండగా.. కియారా మరో క్రేజీ ప్రాజెక్ట్లో భాగం కావడం ఖాయమన్నట్లే కనిపిస్తోంది. వెంటవెంటనే బడా సినిమాలో నటిస్తూ.. ఈ భామ టాప్ ప్లేస్లోకి దూసుకెళ్లేట్టు కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్హాసిని క్రియేషన్స్పై తెరకెక్కించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.