పహిల్వాన్‌ వస్తున్నాడు

13 Jul, 2019 02:00 IST|Sakshi
కిచ్చా సుదీప్‌, ఆకాంక్ష సింగ్‌

‘ఈగ’తో ఇబ్బందులు పడి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌. తాజాగా ‘పహిల్వాన్‌’ అనే చిత్రంలో నటించారాయన. ఇందులో మల్ల యోధుడి పాత్రలో కనిపించనున్నారు. కన్నడంలో రూపొందిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌ తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. ఎస్‌. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి, ఆకాంక్ష సింగ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘ఆల్రెడీ రిలీజయిన ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్ట్‌ 29న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం’’ అని నిర్మాతలు తెలిపారి. ‘కేజిఎఫ్‌’ను తెలుగులో రిలీజ్‌ చేసింది వారాహి బ్యానరే కావడం విశేషం.

మరిన్ని వార్తలు