హీరోయిన్గా కాకపోయినా ‘పింక్’ (2016), ‘ఉరి: ది సర్జికల్స్ట్రైక్స్’ (2019), ‘మిషన్ మంగళ్’ (2019) చిత్రాల్లో మంచి పాత్రల్లో చక్కని నటన కనబర్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు కృతీ కుల్హరీ. ఆమె తాజాగా హాలీవుడ్ చిత్రం ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ హిందీ రీమేక్లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ లండన్లో జరుగుతోంది. ఇందులో కృతి మేకప్ లేకుండా నటిస్తున్నారు. ‘‘మేకప్ లేకుండా ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇలాంటి ఎక్స్పీరియన్స్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. మేకప్ ఉంటేనే స్క్రీన్కు సూట్ అవుతాం అనేం లేదు. పాత్రలో బలం ఉండాలి’’ అని పేర్కొన్నారు కృతీ. రిభు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణీతీ చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. అదితీ రావ్ హైదరీ మరో కీలక పాత్రధారి. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రిభు దాస్గుప్తా దర్శకత్వంలోనే రూపొందిన ‘బార్డ్ ఆఫ్ బ్లెడ్’ అనే వెబ్ సిరీస్లో నటించారు కృతీ కుల్హరీ. సెప్టెంబరు 27న నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.