కోడి రామకృష్ణ మార్కు మాయాజాలం

12 Feb, 2014 00:00 IST|Sakshi
కోడి రామకృష్ణ మార్కు మాయాజాలం
 ‘‘ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టిన ఓ భూతాన్ని, అదే నక్షత్రంలో పుట్టిన ఓ స్త్రీ ఎలా శాసించింది? మూడు గ్రహణాల వ్యవధిలో జరిగిన ఈ పోరాటంలో గెలుపెవరిది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అవతారం’. సాంకేతికంగా ఈ చిత్రం ఓ అద్భుతం’’ అని కోడి రామకృష్ణ అన్నారు. భానుప్రియ, రాధిక కుమారస్వామి, రిషి ప్రధాన పాత్రధారులుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో యం.యుగంధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘అవతారం’. ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. కోడి రామకృష్ణ  మాట్లాడుతూ- ‘‘కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశాం. జర్మని, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమాకు పనిచేశారు’’ అని చెప్పారు. 90 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్ అని, కోడి రామకృష్ణగారితో తొలి సినిమా చేయడం ఆనందంగా ఉందని నిర్మాత చెప్పారు. ఇంకా మాటల రచయిత రాజేంద్రకుమార్, యాదగిరి, మహేంద్రరెడ్డి, బాల తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎం.కవిత.
 
>