ఈ కుమారి దేనికీ కాపీ కాదు!

12 Nov, 2015 22:57 IST|Sakshi
ఈ కుమారి దేనికీ కాపీ కాదు!

‘‘సుకుమార్ దగ్గర ‘ఆర్య’ చిత్రానికి సహాయదర్శకునిగా చేశాను. ఆ తర్వాత ‘కరెంటు’ చిత్రానికి దర్శకునిగా అవకాశం వస్తే చేశాను. మళ్లీ సుకుమార్‌గారి దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో చేసే అవకాశం వచ్చింది. ఆయన రచనా శైలి బాగుంటుంది. అది నేర్చుకుందామని చేరాను. చివరికి తాను రాసుకున్న కథను నాకిచ్చి దర్శకత్వం వహించమన్నారు. ఆ విధంగా నా ఈ ఐదేళ్ల జర్నీకి ఓ సార్థకత వచ్చింది’’ అని పల్నాటి సూర్యప్రతాప్ అన్నారు.

రాజ్‌తరుణ్, హేబా పటేల్ జంటగా సుకుమార్ కథ అందించి, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరితో కలిసి నిర్మించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. సూర్యప్రతాప్ మాట్లాడుతూ - ‘‘సుకుమార్ అనుభవాల్లోంచి పుట్టిన కథ ఇది. ఓ హాలీవుడ్ చిత్రం స్ఫూర్తిగా ఈ సినిమా తీశామన్నది కొంతమంది అభిప్రాయం. అయితే ఈ సినిమా పూర్తిగా సుకుమార్ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్‌తో తీశాం. ఇది దేనికీ కాపీ కాదు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా’’ అన్నారు.