ముగ్గురు యువకుల త్యాగం

20 Jun, 2014 01:13 IST|Sakshi
ముగ్గురు యువకుల త్యాగం

ప్రేమ, కుటుంబం, కెరీర్ కోసం ముగ్గురు యువకులు ఎలాంటి త్యాగం చేశారు? అనే కథాంశంతో ఎల్‌ఆర్ టాకీస్ పతాకంపై జోస్యభట్ల సంతోష్‌కుమార్, లక్ష్మణ్ ముద్దమ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. రవి లోకిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సంతోష్‌కుమార్ కెమెరా స్విచాన్ చేయగా, జోస్యభట్ల శర్మ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా రూపొందిస్తున్నామని దర్శకుడు తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా మారానని సంతోష్‌కుమార్ చెప్పారు. హీరోగా తనకిది తొలి చిత్రం అని పరమేష్, ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయని సంగీతదర్శకుడు కనిష్క తెలిపారు. ఇందులో మంచి పాత్ర చేస్తున్నానని పప్పు అన్నారు.